కర్ణాటక హస్సన్లో అత్యంత అమానుష ఘటన బయటకువచ్చింది. రోడ్డు పక్కన పడుకున్న ఓ మహిళను పెద్ద రాయితో కొట్టి చంపాడు ఓ కిరాతకుడు. అనంతరం ఆమె మృతదేహంపైనే మూడుసార్లు అత్యాచారం చేశాడు.
యాచకురాలిపై...
హస్సన్లోని ఎన్ఆర్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ కన్నికాపరమేశ్వరి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు ఎదుట.. సోమవారం రాత్రి 9గంటలకు ఓ యాచకురాలు పడుకుంది. 9:30గంటలకు అక్కడికి చేరుకున్న ఓ దుర్మార్గుడు.. ఆమెకు కొద్ది దూరంలోనే పడుకుంటున్నట్టు నటించాడు. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో.. ఆమెను సిమెంటు రాయితో కొట్టి చంపేశాడు.
అనంతరం 30నిమిషాల పాటు ఆమె శవాన్ని మూడుసార్లు అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.


ఇదీ చూడండి:- రెండో భార్యకు లేరని.. మొదటి భార్య కూతురు హత్య